Sunday, July 2, 2017

కృష్ణుడు గీతలో చెప్తాడు ....

కృష్ణుడు గీతలో చెప్తాడు ...."అర్జునా ....మనసు నాయందు లగ్నం చేసి ...నన్ను చూడాలి అనుకునే వాళ్లకు మాత్రమే నేను కనిపిస్తాను ....నన్ను దర్శించగలరు అని ...." 
నిజమే కదా అనిపిస్తుంది .... 
అసలు కృష్ణుడంటే ఎవరు ....???!!!
ప్రేమ ....
మనసు నిండా ప్రేమను నింపుకున్న వ్యక్తి ....
మనసు నిండా ప్రేమను ఎవరైతే నింపు కుంటారో ....వాళ్ళ మనసు లో నుండి ప్రేమను ప్రపంచం అంతా విస్తరింప జేస్తారో ...వాళ్లకు ప్రపంచం అంతా ప్రేమే కనిపిస్తుంది ....ఇంకా ఇంకా ఎదిగిపోయి ,విస్తరించి... ప్రపంచం అంతా నిండిపోయి కనిపిస్తుంది ...
ఆ విశావ్యాప్త ప్రేమ మనకు కనిపించాలి అంటే ,మనం చూడాలి అంటే ....మన మనసులో ప్రేమ నింపు కుంటేనే అది సాధ్యం ....చూడగలం ....
అదే మన మనసులో ద్వేషాన్ని నింపుకుంటే మనం అణువంత ప్రేమను కూడా చూడలేం ....అంతే కాకుండా ద్వేషం మనల్ని ఇంకా ఇంకా కుంచించుకు పోయేలా చేసి ఈ ప్రపంచంలో మన ఉనికి మనకే ప్రశ్నార్ధకం చేసి ....మనం ఇతరుల ఉనికి ని చెప్పుకుని బ్రతికేలా చేస్తుంది ....
ప్రేమ మనం ఇంకా ఇంకా ఎదిగేలా చేసి ....ప్రపంచం అంతా మనమే నిండిపోయేలా చేస్తుంది .....ప్రతి అణువులోనూ మనమే కనిపించేలా చేస్తుంది ......
ప్రేమకు నేనే ప్రతిరూపాన్ని అని కృష్ణుడు భావించాడు కాబట్టే ....అర్జునా... నా యందే మనసు లగ్నం చేసి చూస్తే ప్రపంచం అంతా నిండిపోయి నేనే కనిపిస్తాను అన్నాడు ....ప్రేమను మనసు నిండా నింపుకుని ... ప్రేమను చూడమని అర్ధం ....
ఎలాంటి నమ్మకంతో కృష్ణుడు అర్జునిడితో ఈ మాట అనగలిగాడు అని మొన్నామధ్య భగవద్గీత వింటున్నప్పుడు ఆలోచిస్తే ....నేను తెలుసుకున్న అర్ధం ఇది ... 

No comments:

Post a Comment